నారద మహర్షి తెచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవి సిగలో కృష్ణుడు అలంకరిస్తాడు. దాంతో ఆమె ఆనందంతో పొంగిపోతుంది. తన పట్ల కృష్ణుడి ప్రేమానురాగాలకు మురిసిపోతుంది. భర్త పాదాలకు నమస్కరించుకుని, ఆయన మనసులో తనకి అంతటి స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అలా…
నరకాసురుడు మరణించడంతో లోకులంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న తమకి కృష్ణుడి కారణంగా విముక్తి కలిగినందుకు ఆనందిస్తారు. ఇక తమ జీవితంలో నుంచి కష్టాలు .. భయాలు .. చీకట్లు తొలగిపోయాయని భావించి…
కృష్ణుడికి .. నరకాసురిడికి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న సత్యభామ సహనం కోల్పోతుంది. నరకాసురుడు అవమానకరంగా మాట్లాడుతుంటే, అంతగా బుజ్జగించవలసిన అవసరం ఏవుందని సత్యభామ అంటుంది. నరకాసురుడు యుద్ధమే కోరుకుంటున్నప్పుడు వారించవలసిన అగత్యం ఏవుందని అడుగుతుంది. ఇప్పటికే నరకాసురుడు ఎక్కువగా మాట్లాడే…
కృష్ణుడు ఎన్నివిధాలుగా చెప్పినా వినిపించుకోకుండా నరకాసురుడు సంగ్రామానికి సిద్ధపడతాడు. తనతో యుద్ధం చేసే సాహసం చేయలేకనే మంచి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటూ అవమానకరంగా మాట్లాడతాడు. కృష్ణుడు ఒంటరిగా కాకుండా సత్యభామను యుద్ధానికి తీసుకురావడం గురించి ఎద్దేవా చేస్తాడు. ఇంతకుముందు అతని…
కృష్ణుడు తనని ఎదిరించడానికి సిద్ధమవుతున్నాడనే విషయం తెలియగానే నరకాసురుడు నవ్వుకుంటాడు. ఒక గోపాలకుడు తనని ఎదిరించడానికి పూనుకోవడమా? తాను ఇంద్రాది దేవతలను ఎదిరించిన విషయం తెలిసి కూడా ముందడుగు వేయడమా? నరకాసురిడితో యుద్ధం అంటే గోపికలతో కలిసి నాట్యం చేయడం కాదనే…
భూలోకంలో నరకాసురుడి ఆగడాలకు అడ్డుకట్టలేకుండా పోతుంది. ఎవరూ యజ్ఞయాగాదులు నిర్వహించరాదని ఆయన ప్రకటిస్తాడు. అంతేకాదు .. ఎవరూ కూడా హరినామ స్మరణ చేయరాదనే శాసనం చేస్తాడు. తన ఆదేశాలను వ్యతిరేకించిన వారిని చెరసాలలో వేయిస్తుంటాడు. తన శాసనాలను ధిక్కరించినవారిని చిత్రహింసలకు గురిచేస్తూ…
రుక్మిణీదేవి .. జాంబవతి .. సత్యభామను వివాహమాడిన కృష్ణుడు, ఆ తరువాత కాళింది .. మిత్రవింద .. నాగ్నజితి .. భద్ర .. లక్షణను కూడా వివాహమాడతాడు. అష్ట భార్యలు అలగకుండగా కృష్ణుడు వాళ్లకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే సత్యభామకు…
అనవసరంగా కృష్ణుడిని అనుమానించినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాప పడతాడు. నలుగురిలో ఆయనను అనరాని మాటలు అన్నందుకు బాధపడతాడు. కృష్ణుడిని ద్వేషిస్తూ .. ఆయన పట్ల సత్యభామకు గల ప్రేమానురాగాలను అర్థం చేసుకోలేకపోయినందుకు ఆవేదన చెందుతాడు. ఇందుకు శతధన్వుడు .. ప్రసేనజిత్తు ఇద్దరూ కారణమేనని…
సత్రాజిత్తు తనపై వేసిన నింద నిజం కాదని నిరూపించడం కోసం .. కృష్ణుడు తన పరివారంతో అడవుల్లోకి వెళతాడు. అలా ఆయన దట్టమైన అడవుల్లోకి వెళ్లిన తరువాత, ప్రసేనుడికి సంబంధించిన వస్త్రాలు ఒక చోట కనిపిస్తాయి. అక్కడి నుంచి సింహం పాదాల…
కృష్ణుడి దగ్గరికి సత్రాజిత్తు వెళతాడు .. ఆయన ఆగ్రహావేశాలతో ఉండటం చూసిన కృష్ణుడు అయోమయానికి లోనవుతాడు. ఏం జరిగిందని అడుగుతాడు. చేసినదంతా చేసి ఏమీ తెలియనివాడి మాదిరిగా నటించవద్దంటూ సత్రాజిత్తు మండిపడతాడు. విషయమేవిటో అర్థంకాక అతనివైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు. కృష్ణుడు మాయదారి…
