ఒక వైపున కృష్ణుడు .. సత్యభామను పెళ్లాడాలని భావించడం, మరో వైపున “శ్యమంతకమణి”ని గురించి అడగడం సత్రాజిత్తుకు ఆందోళన కలిగిస్తుంది. కృష్ణుడు మహా మాయావి కనుక, ఏ క్షణంలోనైనా ఆయన సత్యభామను సొంతం చేసుకోవచ్చును. అలాగే తన నుంచి “శ్యమంతకమణి”ని కూడా…
సత్రాజిత్తు మొదటి నుంచి కూడా సూర్యభగవానుడికి మహా భక్తుడు. అనునిత్యం సూర్యోపాసన తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఆయన ఒక్కగానొక్క కూతురు సత్యభామ. ఆమె అందచందాలను గురించి కృష్ణుడు వింటాడు. ఇక ఆమె మనసులో కూడా ఆయనే ఉంటాడు….
కృష్ణుడు .. రుక్మిణి దంపతులు ప్రేమకు ప్రతీకలుగా, మమతానురాగాల మాలికలుగా వెలుగొందుతుంటారు. క్షణమైనా కృష్ణుడిని విడిచి ఉండలేని రుక్మిణీదేవి ఆయన సేవలోనే కాలం గడుపుతూ ఉంటుంది. తన వాళ్లందరినీ తన కోసం వదులుకుని వచ్చిన కారణంగా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం…
విదర్భ దేశానికి చెందిన “కుండినపురము” నుంచి రుక్మిణీదేవిని అపహరించిన కృష్ణుడు, ఆమెను వెంటబెట్టుకుని ద్వారక చేరుకుంటాడు. రుక్మిణీదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించిన ద్వారకవాసులు సంతోష సంబరాల్లో మునిగిపోతారు. రుక్మిణీ కృష్ణుల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలంతా కూడా తమ…
విదర్భలోని “కుండిన నగరం”లో రుక్మిణీ కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. శిశుపాలుడు తన పరివారంతో అక్కడికి చేరుకుంటాడు. రాజలాంఛనాలతో ఆయన పరివారానికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపున రుక్మిణీదేవిని పెళ్లి కూతురుగా అలంకరిస్తారు. తాను చెప్పిన సమయానికి కృష్ణుడు వస్తాడా…
“విదర్భ” రాజ్యాన్ని భీష్మకుడు అను రాజు పరిపాలిస్తూ ఉంటాడు .. ఆయన కుమార్తెనే “రుక్మిణీ దేవి”. ఆమె సౌందర్యాన్ని గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు అనుకుంటాడు. ఇక కృష్ణుడి రూపం .. ఆయన వీరోచిత కార్యాలను…
శిశుపాలుడు “చేది” దేశానికి రాజు .. దమఘోషుడు .. సాత్వతిలకు జన్మించినవాడు. కృష్ణుడికి సాత్వతి మేనత్త అవుతుంది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయన రూపం చాలా వికృతంగా ఉండేది. మూడు కన్నులు .. నాలుగు చేతులతో ఆయన జన్మించాడు. చూడటానికి ఆయన చాలా…
కృష్ణుడి ఆదేశం మేరకు విశ్వకర్మ ద్వారకా నగరమును నిర్మిస్తాడు. ఎత్తైన భవనాలు .. విశాలమైన పురవీధులు .. అందమైన వనాలతో ప్రజలందరికీ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ నగరాన్ని తీర్చిదిద్దుతాడు. శత్రువులు అంత తేలికగా ద్వారక చేరుకోలేని విధంగా పకడ్బందీ…
ముచుకుందుడు సూర్యవంశానికి చెందినవాడు .. మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచుకుందుడిని యుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు ఆయన. కదన రంగాన మహామహావీరులు సైతం ఆయన ఎదురుగా నిలబడలేరు .. ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు…
కాలయవనుడిని తప్పించుకోవడం కోసం కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన కాలయవనుడు .. ఆ వెనుకనే ఆ గుహలోకి వెళతాడు. పొడవైన .. విశాలమైన ఆ గుహలో అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోనే ఆయన కృష్ణుడి కోసం వెతకడం…
