“విదర్భ” రాజ్యాన్ని భీష్మకుడు అను రాజు పరిపాలిస్తూ ఉంటాడు .. ఆయన కుమార్తెనే “రుక్మిణీ దేవి”. ఆమె సౌందర్యాన్ని గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు అనుకుంటాడు. ఇక కృష్ణుడి రూపం .. ఆయన వీరోచిత కార్యాలను…
పురాణాలు
Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.
శిశుపాలుడు “చేది” దేశానికి రాజు .. దమఘోషుడు .. సాత్వతిలకు జన్మించినవాడు. కృష్ణుడికి సాత్వతి మేనత్త అవుతుంది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయన రూపం చాలా వికృతంగా ఉండేది. మూడు కన్నులు .. నాలుగు చేతులతో ఆయన జన్మించాడు. చూడటానికి ఆయన చాలా…
కృష్ణుడి ఆదేశం మేరకు విశ్వకర్మ ద్వారకా నగరమును నిర్మిస్తాడు. ఎత్తైన భవనాలు .. విశాలమైన పురవీధులు .. అందమైన వనాలతో ప్రజలందరికీ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ నగరాన్ని తీర్చిదిద్దుతాడు. శత్రువులు అంత తేలికగా ద్వారక చేరుకోలేని విధంగా పకడ్బందీ…
ముచుకుందుడు సూర్యవంశానికి చెందినవాడు .. మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచుకుందుడిని యుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు ఆయన. కదన రంగాన మహామహావీరులు సైతం ఆయన ఎదురుగా నిలబడలేరు .. ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు…
కాలయవనుడిని తప్పించుకోవడం కోసం కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన కాలయవనుడు .. ఆ వెనుకనే ఆ గుహలోకి వెళతాడు. పొడవైన .. విశాలమైన ఆ గుహలో అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోనే ఆయన కృష్ణుడి కోసం వెతకడం…
కృష్ణుడిని చూడగానే “కాలయవనుడు” ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన వరబలం .. భుజబలం సంగతి తెలియక కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకుంటాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనని మట్టుపెట్టగలననే నమ్మకంతో అతను వస్తుండవచ్చని భావిస్తాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను…
బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం .. కృష్ణుడు అతనిని తప్ప మిగతావారిని కడతేర్చడం జరుగుతూ రాసాగింది. ఇలా తరచూ జరుగుతూ రావడంతో,…
కంసుడిని అంతం చేయడానికి ముందు అతని వెనుక “జరాసంధుడు” ఉన్నాడనే ఒక ఆలోచన చేసి ఉండవలసిందని జరాసంధుడు కృష్ణుడితో అంటాడు. తన జోలికి .. తనవారి జోలికి వచ్చిన వాళ్లను జరాసంధుడు అంత తేలికగా వదిలిపెట్టడనే విషయమైనా తెలుసుకుని ఉండవలసిందని చెబుతాడు….
“మధుర” రాజుల ఆధిపత్యం నచ్చని రాజులందరినీ కూడగట్టిన జరాసంధుడు, కృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరతాడు. భారీ సైనిక దళాలతో ఆయన ముందుకు కదులుతూ ఉంటాడు. జరాసంధుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం కృష్ణుడికి తెలిసిపోతుంది. జరాసంధుడు దుష్టబుద్ధి కలిగినవాడు .. దుర్మార్గులతోనే ఆయన…
సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన బలరామకృష్ణులు, ఆ మహర్షి దంపతుల దగ్గర సెలవు తీసుకుని “మధుర” చేరుకుంటారు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, “మగధ” భూపాలుడైన “జరాసంధుడు” కృష్ణుడిపై ఆగ్రహావేశాలతో…
